కోల్కతా : పెండ్లి మండపంలోనూ ల్యాప్టాప్తో పెండ్లికొడుకు కుస్తీ పడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఇన్స్టాగ్రాంలో @ఐజి_కోల్కతా షేర్ చేసింది. ఈ ఫోటోలో కోల్కతాకు చెందిన పెండ్లి కొడుకు పెండ్లి మండపంపై ఇద్దరు పురోహితులతో కలిసి కూర్చున్నాడు.
పెండ్లికొడుకు ల్యాప్టాప్పై పనిచేస్తూ బిజీగా ఉంటే పురోహితులు అతడిని ఆశీర్వదిస్తూ కనిపించారు. వర్క్ ఫ్రం హోం నెక్ట్స్ లెవెల్ ఇదేనంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. వైరల్గా మారిన ఈ పోస్ట్కు ఇప్పటివరకూ పదివేలకు పైగా లైక్స్ వచ్చాయి.
ఊపిరిసలపని వర్క్ కల్చర్ను ప్రోత్సహించవద్దని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇదే నిజమైతే పెండ్లికొడుకు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ను నేర్చుకోవాలని, పెండ్లి రోజున పనిచేయాలని ఏ కంపెనీ ఉద్యోగిని కోరదని మరో యూజర్ రాసుకొచ్చారు. ఇతడు పెండ్లి చేసుకునే అమ్మాయిని దేవుడు ఆశీర్వదించాలని మరో యూజర్ కామెంట్ చేశారు.