పట్నా : వివాహేతర సంబంధం కారణంగా నిండు ప్రాణం బలైంది. ఈ ఘటనలో బాధితుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన ఈనెల 18న బిహార్లోని బర్ ప్రాంతంలో వెలుగుచూసింది. నిందితుల్లోని ఒకరి తల్లితో మృతుడు వివాహేతర సంబంధం కలిగిఉన్నాడు. నిందితులు వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని రైల్వేట్రాక్పై పడేసి పరారయ్యారు.
పోలీసులు దర్యాప్తు చేపట్టగా మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందని వెల్లడైంది. మోనుగా గుర్తించిన బాధితుడికి పలువురు మహిళలతో లైంగిక సంబంధాలున్నాయని తెలిసింది. ఇటీవల మోను ఓ మహిళతో సన్నిహితంగా ఉండటం ఆమె కుమారుడి కంటపడింది.
తన తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మోనును కడతేర్చాలని నిందితుడు బాదల్ నిర్ణయించుకున్నాడు. మరో ఇద్దరు స్నేహితులు అంకిత్, భజోలతో కలిసి మోనును హత్య చేశాడు. తొలుత వీరు మోనుకు మద్యం తాగించి ఆపై కత్తితో పొడిచి చంపారు. హ్యత కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.