న్యూఢిల్లీ : ప్రియుడిని చేరేందుకు ఆమెకు సరిహద్దులు అడ్డుకాలేదు. అరణ్యం, నీటి ప్రవాహం ఆమె సంకల్పాన్ని నీరుగార్చలేదు. మనసిచ్చిన వాడిని మనువాడేందుకు ఆమె దండకారణ్యం దాటుకుని..నదీ ప్రవాహానికి ఎదురీది బంగ్లాదేశ్ నుంచి ఏకంగా భారత్కు చేరుకుంది.
భారత్కు చెందిన ప్రియుడిని పెండ్లి చేసుకునేందుకు బంగ్లా మహిళ (22) గమ్యస్ధానానికి చేరుకుంది. భారత్కు చెందిన అభిక్ మండల్, బంగ్లాదేశ్ మహిళ కృష్ణా మండల్కు ఫేస్బుక్ వేదికగా చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. కృష్ణ మండల్కు పాస్పోర్టు లేకపోవడంతో అక్రమంగా సరిహద్దు దాటాలని నిర్ణయించుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణ తొలుత రాయల్ బెంగాల్ టైగర్స్కు పేరొందిన సుందర్బన్స్లో ప్రవేశించింది. ఆపై గంటపాటు నదిలో ఈదుతూ తన గమ్యస్ధానానికి చేరుకుంది. కోల్కతాలోని కాళీఘాట్ ఆలయంలో మూడు రోజుల కిందట ఆమె ప్రియుడు అభిక్ను పెండ్లి చేసుకుంది. అయితే అక్రమంగా దేశంలోకి వచ్చినందుకు కృష్ణ మండల్ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ హై కమిషన్కు కృష్ణను అధికారులు అప్పగిస్తారని సమాచారం.