న్యూఢిల్లీ, మే 2: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళా కోటా అమలుపై గురువారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎస్సీబీఏ)లో మూడింట ఒక వంతు మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది.
ఇకపై ఎస్సీబీఏలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, కోశాధికారి.. అందరూ మహిళలే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.