న్యూఢిల్లీ, అక్టోబర్ 26: భారత్లో 51 శాతం మంది చిన్నారులు పేదరికం, వాతావరణ విపత్తుల నీడలో బతుకీడుస్తున్నారని తాజా అధ్యయనం పేర్కొన్నది. మొత్తం ఆసియా వ్యాప్తంగా 35 కోట్ల మంది చిన్నారులు ఈ రెండు విపత్తుల కబంధహస్తాల కింద ఉన్నారని ‘జనరేషన్ హోప్ : 2.4 బిలియన్ రీజన్స్ టు ఎండ్ ది గ్లోబల్ ైక్లెమేట్ అండ్ ఇనిక్వాలిటీ క్రైసిస్’ నివేదిక తెలిపింది.
ఈ డబుల్ ముప్పును అధికంగా ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో కంబోడియా (72% చిన్నారులపై ప్రభావం) మొదటి స్థానంలో ఉన్నదని, తర్వాతి స్థానాల్లో మయన్మార్(64%), అఫ్గానిస్థాన్(57%) ఉన్నాయని తెలిపింది. సంఖ్యాపరంగా చూస్తే ఈ విషయంలో భారత్లో చిన్నారులు అధికంగా ఉన్నారు.