న్యూఢిల్లీ : వరదలతో ఏపీ, తమిళనాడు సతమతమవుతుంటే మరోసారి ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో రాబోయే ఐదు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
దక్షిణ కోస్తా తీరం, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో నవంబర్ 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాలతో ఏపీలో చిత్తూరు, నెల్లూరు సహా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా అపార నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.