న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే, ఈ వర్షాలు ఇప్పుడప్పుడే తగ్గుముఖం పట్టేలా లేవని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) చేసిన ప్రకటనతో స్పష్టమవుతున్నది. రాగల ఐదు రోజులపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతోపాటు సెమీ స్టేట్ పుదుచ్చేరిలోనూ వర్షాలు ( Rains ) కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా పడే అవకాశం కూడా ఉందని వెల్లడించింది.