ముంబై: మసీదుల వద్ద అక్రమ లౌడ్స్పీకర్లను తొలగించనంత వరకు హనుమాన్ ఛాలీసా వల్లిస్తూనే ఉంటామని రాజ్ థాకరే వార్నింగ్ ఇచ్చారు. భారీ సౌండ్లు వచ్చే లౌడ్స్పీకర్లను మసీదుల నుంచి తీసి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ లౌడ్స్పీకర్లను తొలగించనంత వరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుంని థాకరే అన్నారు. రాష్ట్రంలో శాంతి కావాలని, ఇవాళ 135 మసీదులు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించాయని, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని పోలీసుల్ని ఆయన ప్రశ్నించారు. కేవలం ఎంఎన్ఎస్ కార్యకర్తలపైనే చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మసీదులే కాదు చాలా వరకు ఆలయాల్లో భారీ లౌడ్స్పీకర్లు ఉన్నాయన్నారు. లౌడ్స్పీకర్ల అంశం మతపరమైంది కాదు అని, అదో సామాజిక సమస్య అని రాజ్ థాకరే తెలిపారు.