పోర్ట్ అలెగ్జాండ్రియా: భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్-78 ట్యాంకర్.. ఈజిప్టు వైమానిక దళానికి చెందిన మిగ్29 ఎం, రాఫేల్ యుద్ధ విమానాలకు ఫుయలింగ్ చేసింది. ఎక్స్ బ్రైట్ స్టార్ 23(Ex Bright Star 23) పేరుతో ఈజిప్టులో సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. సుమారు 34 దేశాలకు చెందిన త్రివిధ దళాలు ఆ విన్యాసాల్లో తమ సత్తా చూపిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇవాళ భారతీయ వైమానిక దళానికి చెందిన ఐఎల్-78 ట్యాంకర్ తన విన్యాసాన్ని ప్రదర్శించింది. ఈజిప్టు సైన్యానికి చెందిన మిగ్29, రాఫేల్ ఫైటర్లకు .. ఆ ట్యాంర్ ద్వారా ఆకాశంలోనే ఇంధనాన్ని నింపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్29 కూడా పాల్గొన్నది.
#WATCH | An IL-78 tanker of the Indian Air Force refuels Mig 29 M and Rafale fighters of the Egyptian Air Force as part of Ex Bright Star 23. IAF Mig 29 UPG also seen as part of this mission. pic.twitter.com/53eZT4dFdd
— ANI (@ANI) September 12, 2023
మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రాంతంలో జరుగుతున్న సైనిక విన్యాసాల్లో ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 23 ఈవెంట్ చాలా పెద్దది. సుమారు రెండు వారాల పాటు ఆ విన్యాసాల్ని నిర్వహించనున్నారు. ఈ విన్యాసాల్లో భారతీయ నౌకాదళం కూడా పాల్గొంటోంది. రెండు దశల్లో ఈ విన్యాసాల్ని నిర్వహిస్తున్నారు. భారతీయ నేవీకి చెందని ఐఎన్ఎస్ సుమేదా ఈ ఈవెంట్లో పాల్గొంటోంది.
#IndianArmy displaying the professional prowess in Exercise #BrightStar 2023#TrainingTuesday#OnPathToTransformation@IaSouthern@HQ_IDS_India@indembcairo pic.twitter.com/rap73qW9su
— ADG PI – INDIAN ARMY (@adgpi) September 12, 2023