ఐవోసీ చైర్మన్ అభినందన
తిరువనంతపురం: సాధించాలన్న తపన, అంతకు మించిన పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చని నిరూపించారు ఆర్య రాజగోపాలన్. తన చదువు కోసం గత 20 ఏండ్లుగా పెట్రోల్ బంకులో శ్రమిస్తున్న తండ్రి కలను ఆమె సాకారం చేశారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ-కాన్పూర్లో పెట్రోలియం ఇంజినీరింగ్లో ఎంటెక్ సీటు సాధించారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఛైర్మన్ శ్రీకాంత్ మాదవ్ వైద్య వెల్లడించారు. 2005 నుంచి తాను పనిచేస్తున్న ఐవోసీలోనే తన కూతురికి కూడా ఉద్యోగం లభిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.