న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ను ఐఐటీ మద్రాస్ ఇచ్చింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ మధ్య థార్డ్వేవ్ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఇండియాలో ఆర్-నాట్ వాల్యూ ఈ వారం 4కు చేరుకున్నదని, దాని ఆధారంగా ఫిబ్రవరి తొలి రెండు వారాల్లో అధిక స్థాయిలో కేసులు నమోదు అవుతాయని ఐఐటీ మద్రాస్ విశ్లేషకులు తెలిపారు. R నాట్ లేదా R0 .. ద్వారా ఒకరి నుంచి ఎంత మందికి వైరస్ సోకుతుందో తెలిసిపోతుంది. అయితే R వాల్యూ ఒకటి కన్నా తక్కువగా ఉంటే.. అప్పుడు మహమ్మారి అంతం అయినట్లు లెక్క. ఐఐటీ మద్రాస్ చేపట్టిన కంప్యూటేషన్ మోడలింగ్ విధానం ఆధారంగా.. గత వారం దేశంలో R0 వాల్యూ 2.9గా ఉందని, ప్రస్తుతం జనవరి ఒకటి నుంచి 6వ తేదీ మధ్య ఆ వాల్యూ 4కు చేరినట్లు అంచనా వేశారు. మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ జా ఈ రిపోర్ట్ను తయారు చేశారు.