కాన్పూర్, అక్టోబర్ 5: త్వరలో ఉత్తరప్రదేశ్, చుట్టుపక్కల రాష్ర్టాల్లో భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉన్నదని ఐఐటీ కాన్పూర్కు చెందిన భూకంప నిపుణుడు హెచ్చరించారు.
నేపాల్లో మంగళవారం వచ్చిన భూకంపం కారణంగా ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐఐటీ కాన్పూర్కు చెందిన ప్రొఫెసర్ జావేద్ మాలిక్ మాట్లాడుతూ.. గంగా నదీ తీరంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్తులో మరింత తీవ్రమైన భూకంపం సంభవించే అవకాశం ఉందన్నారు. అయితే ఇది ఎప్పుడు వస్తుందన్నది అంచనా వేయలేమన్నారు.