ముంబై : వర్చువల్ లెక్చర్ సందర్భంగా పాలస్తీనా టెర్రరిస్ట్లకు అనుకూలంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఓ ప్రొఫెసర్, గెస్ట్ స్పీకర్పై ఐఐటీ బాంబే విద్యార్ధులు (IIT Bombay) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 6న వర్చువల్ లెక్చర్ సందర్భంగా టెర్రరిస్టులకు మద్దతుగా మాట్లాడిన ప్రొఫెసర్, స్పీకర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఐఐటీ బాంబేకు చెందిన హ్యుమనిటీస్, సోషల్ సైన్సెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శర్మిష్ట సాహా అకడమిక్ కోర్సు కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్లో గెస్ట్ స్పీకర్గా సుధాన్వ దేశ్పాండేను ఆహ్వానించారు. రాడికల్ లెఫ్టిస్ట్ అయిన దేశ్పాండేను శర్మిష్ట తన పదవిని అడ్డుపెట్టుకుని గెస్ట్ స్పీకర్గా ఆహ్వానించారని విద్యార్ధులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
పాలస్తీనా ఉగ్రవాదులు జకారియా జుబేది, ఘసన్ కనఫనిలను దేశ్పాండే గొప్పగా చిత్రీకరించడంతో పాటు సాయుధ తిరుగుబాటును సమర్ధించారని విద్యార్ధులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పలు ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్ధలు, ఐరోపా యూనియన్, అమెరికా, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు ఉగ్రవాద సంస్ధగా ప్రకటించిన అల్ అక్స మార్ట్రైస్ బ్రిగేడ్స్లో జుబైదికి అనుబంధం ఉందని విద్యార్ధులు వివరించారు. ఉగ్రవాద సిద్ధాంతాలను ప్రేరేపించేలా వీరు మాట్లాడటం భద్రతా ముప్పులకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :