ముంబై: ఐఐటీ బాంబేలో ఓ దళిత విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అహ్మదాబాద్కు చెందిన దర్శన్ సోలంకి.. క్యాంపస్లోని హాస్టల్ బిల్డింగ్ ఏడో అంతస్తు పైనుంచి దూకి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. దళితుడని కుల వివక్ష చూపిన కారణంగానే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా, ప్రమాదవశాత్తు మరణించాడని పోలీసులు తెలిపారు.
సెమిస్టర్ -1 పరీక్షలు శనివారంతో ముగిసాయి. పరీక్షల ఒత్తిడి కారణంగా దర్శన్ ఈ చర్యకు పాల్పడ్డారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏపీలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అఖిల అనే విద్యార్థిని హాస్టల్ రూమ్లో మృతిచెంది కన్పించింది. ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.