అహ్మదాబాద్, ఫిబ్రవరి 13: వారిద్దరూ రోజువారీ కూలీలు. అయితే నెలకు రూ.25 వేల జీతంతో కొందరు వారిని నియమించుకున్నారు. వారు చేయాల్సిందల్లా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఐ ఫోన్లు, ఇతర మొబైల్స్ అపహరించడమే. దానికి వారికి అనుభవం లేకపోయినా ఫర్వాలేదంటూ ముఠాను నడుపుతున్న నిర్వాహకులే 45 రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఇలాంటి ముఠా గుట్టును రట్టు చేశారు. అహ్మదాబాద్ సిటీ క్రైం పోలీసులు.
అవినాశ్ మహతో, శ్యాం కుర్మి అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.29 లక్షల విలువైన 58 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అవినాశ్ సోదరుడు పింటూ మహతో, రాహుల్ మహతోలు నియమించి దొంగతనాల్లో శిక్షణ ఇచ్చి వారి ద్వారా మొబైల్స్ చోరీ చేయించేవారు. వారు తెచ్చిన మొబైల్స్ను అన్లాక్ చేసి నేపాల్, బంగ్లాదేశ్లకు పంపేవారు. చోరీ చేసిన మొబైళ్లలో ఐఫోన్లు అధికంగా ఉన్నాయి.