సిల్చర్: ఒకవేళ తాము ఎన్నికల్లో గెలిస్తే, అప్పుడు ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) అన్నారు. సిల్చర్లో జరిగిన పబ్లిక్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. డిటెన్షన్ క్యాంపులో ఎంత మందిని బంధిస్తారని దీదీ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు చాలా భయానకంగా ఉండబోతున్నాయని, గతంలో ఎన్నడు కూడా తాను ఇంత అవినీతి ఎన్నికలను చూడలేదని ఆమె పేర్కొన్నారు. మోదీ సర్కారులో అల్లర్లు గ్యారెంటీ అని, జనం కోసం మోదీ ఏదో చేస్తారని తాను ఆశించడం లేదని, ఇదో మోసపూరిత ప్రభుత్వమని, ఎటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆమె అన్నారు.