బెంగుళూరు: బెంగుళూరు టెకీ(Bengaluru Techies) ఉద్యోగులకు ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా టెకీ ఉద్యోగి.. రోడ్డు వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘిస్తే, అప్పుడు ఆ ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీకి ఫిర్యాదు చేయనున్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంగుళూరు ట్రాఫిక్ పోలీస్కు చెందిన తూర్పు శాఖ ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టింది. పైలెట్ పద్ధతిలో దీన్ని చేపట్టారు. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు, వైట్ఫీల్డ్ ప్రాంతాల్లో ఈ డ్రైవ్ను చేపడుతున్నారు.
ఒకవేళ ఈ ప్రాంతంలో ఉల్లంఘనలు తగ్గితే, అప్పుడు ఈ విధానాన్ని ఇతర ప్రదేశాల్లో అమలు చేయనున్నట్లు బెంగుళూరు పోలీసులు చెప్పారు. ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి కంపెనీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఈస్ట్ డివిజన్ డీసీపీ కుల్దీప్ కుమార్ జైన్ తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘించిన వ్యక్తి ఐడీ కార్డును పరిశీలించి, దాని ఆధారంగా అతని కంపెనీని గుర్తించి, ఆ కంపెనీకి ఫిర్యాదులను చేరవేయనున్నారు.
రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కంపెనీలకు పోలీసులు సూచించారు.