ఆగ్రా: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ అజిజ్ ఖురేషి తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని, దేశం మొత్తాన్ని అమ్మేసి సర్వనాశనం చేస్తుందని అన్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన కోరారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ ఓర్వలేకపోతున్నదని, అందుకే రాజ్యాంగంలో కూడా మార్పులు చేయాలనుకుంటున్నదని అన్నారు. మన దేశం, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు.