న్యూఢిల్లీ, జూలై 5: వాహనాలన్నీ ఇథనాల్తో నడిచే రోజు వస్తే.. లీటర్ పెట్రోల్ ధర రూ.15కు దిగి వస్తుందని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. రైతులు ఉత్పత్తి చేసిన ఇథనాల్తో నడిచే కారు ఆగస్టులో మార్కెట్లోకి రాబోతున్నదని తెలిపారు. రాజస్థాన్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ సరికొత్త శాస్త్రీయ ఆవిష్కరణలతో ప్రజలకు లబ్ది చేకూరుతుందని, కాలుష్యాన్ని తగ్గించటమే కాదు.. ముడిచమురు దిగుమతులను తగ్గిస్తుందన్నారు. ముడిచమురు దిగుమతుల కోసం భారత్ రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నదని, ఇథనాల్, విద్యుత్తో నడిచే వాహనాలు పెరిగితే.. రైతులు మంచి ఆదాయాన్ని పొందుతారని చెప్పారు.