కుల్గామ్: భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చల ద్వారా కశ్మీర్ అంశంపై ఒక పరిష్కారావడం ఉత్తమమని, లేదంటే కశ్మీర్ పరిస్థితి ‘గాజా’ లా మారుతుందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ పెద్దదిక్కు ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) అభిప్రాయపడ్డారు. కశ్మీర్ సమస్యకు చర్చలే సరైన పరిష్కారమని అన్నారు.
కశ్మీర్కు ఒకవైపు పాకిస్థాన్, మరోవైపు చైనా ఉన్నాయని ఒకవేళ యుద్ధం జరిగితే తీవ్రంగా నష్టపోయేది కశ్మీర్ ప్రజలేనని ఫరూఖ్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. పొరగు దేశాలతో సత్సంబంధాలే క్షేమకరమని వ్యాఖ్యానించారు. ‘మనం స్నేహితులను మార్చగలమేమో గానీ ఇరుగుపొరుగును మార్చలేం’ అని గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్నారని అబ్దుల్లా గుర్తుచేశారు.
#WATCH | Kulgam, J&K: Former CM of Jammu and Kashmir, Farooq Abdullah says”…We were a part of Bharat Jodo Yatra and will be a part of Bharat Nyay Yatra…There can be a situation in Kashmir (like that in Gaza) if India and Pakistan do not go for dialogue… On one side we have… pic.twitter.com/RVKSUqKQXM
— ANI (@ANI) December 27, 2023