న్యూఢిల్లీ, జనవరి 14: ఢిల్లీలోని ఘాజీపూర్ మార్కెట్లో శుక్రవారం బాంబు(ఐఈడీ) కలకలం రేగింది. పూల మార్కెట్లోని ఓ బ్యాగులో బాంబు కనిపించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డులు బాంబును అక్కడి నుంచి తరలించి వేరే చోట పేల్చివేశారు. బాంబు బరువు 3 కిలోల దాకా ఉంటుందని, తయారీలో ఆర్డీఎక్స్, అమ్మోనియం నైట్రేట్ వాడినట్టు ప్రాథమికంగా తెలిసిందని అధికారులు అన్నారు. బాంబును ఇస్త్రీ పెట్టెలో పెట్టి నల్లటి కవర్ చుట్టినట్టు తెలిపారు.త్వరలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.