నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన 60 ఏండ్ల సంజూ భగత్ 36 ఏండ్లపాటు తన కవల సోదరుడి పిండాన్ని కడుపులో మోశాడు. తోటివారు అతడిని ‘ప్రెగ్నెంట్ మ్యాన్’ అని పిలిచేవారు. 1999లో అస్వస్థతకు గురికావడంతో ముంబైలో డాక్టర్ అజయ్ మెహతాను కలిశారు.
కొంతకాలం తర్వాత ఆపరేషన్ చేయగా ఎముకలు, వెంట్రుకలతో కూడిన పిండం బయటపడింది. ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ కారణంగా భగత్ కడుపులో పిండం ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.