హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్మోహన్ సింగ్ను బీహార్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తప్పుబట్టారు. ఈ విషయంలో వెంటనే సుప్రీం కోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని కోరుతూ బుధవారం ట్వీట్ చేశారు.
కృష్ణయ్య కుటుంబానికి భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘సివిల్ సర్వెంట్గా ఉంటే ఇచ్చే విలువ ఇంతేనా? అని ఆశ్చర్యం కలుగుతుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తూ భారత ఐఏఎస్ అధికారుల సంఘం విడుదల చేసిన ప్రకటనను రీట్వీట్ చేశారు.