న్యూఢిల్లీ : మనం భారత్లో లేదా విదేశాల్లో ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం మన కర్తవ్యం. ఆయా ప్రదేశాల్లో వ్యర్ధాలు పడేసి ఆ ప్రాంతాన్ని చెత్తకుప్పలా మార్చేస్తారని ఎవరూ ఊహించరు. ఎవరెస్ట్ పర్వత శ్రేణులను పర్వతారోహకులు ఎంతో పదిలంగా కాపాడుకుంటారని, దాని పరిరక్షణ వారి బాధ్యతని భావిస్తుంటాం.
కానీ ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు షేర్ చేసిన వీడియోలో (Viral Video) మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్ సైట్ మురికికూపంలా మారడం నెటిజన్లను షాక్కు గురిచేస్తోంది. పర్వతారోహకుల్లో ఒకరు రికార్డు చేసి ఉంటారని భావిస్తున్న ఈ వీడియోలో మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్ సైట్లో అపరిశుభ్రత రాజ్యమేలడం కనిపిస్తుంది. మౌంట్ ఎవరెస్ట్నూ మనుషులు విడిచిపెట్టకుండా దాన్ని చెత్తకుప్పలా, ప్లాస్టిక్ కాలుష్యంతో నింపేశారని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
When human beings don’t spare even Mount Everest from dumping their garbage and plastic pollution. Truly heartbreaking. #stopplasticpollution #MountEverest #everest video by @EverestToday pic.twitter.com/zuuorrkADF
— Supriya Sahu IAS (@supriyasahuias) May 29, 2023
మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్సైట్ను కొందరు హారిబుల్ సైట్గా అభివర్ణించగా, దీన్ని నిరోధించేందుకు కఠిన చట్టాలు అవసరమని మరో యూజర్ రాసుకొచ్చారు. ప్రకృతిని కాపాడుకోవాలంటే కొన్ని ప్రాంతాల్లోకి మనుషులను అనుమతించరాదని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
Read More