న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: గ్యాంగ్స్టర్, బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ను జైలు నుంచి విడుదల చేయటాన్ని దివంగత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య భార్య ఉమా కృష్ణయ్య సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.‘ఆనంద్ మోహన్ చచ్చేంత వరకూ జీవిత ఖైదు అనుభవించాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. జైలు నిబంధనలు మార్చి, 14 ఏండ్లు శిక్ష పూర్తి చేసుకున్నాడని విడుదల చేయటం ఏంటి?’ అంటూ ఉమా కృష్ణయ్య పిటిషన్లో పేర్కొన్నారు. బీహార్ జైలు మాన్యువల్కు నితీశ్ ప్రభుత్వం పలు సవరణలు చేసి ఏప్రిల్ 10న జీవిత ఖైదు అనుభవిస్తున్న 27 మంది ఖైదీలను విడుదల చేసింది. క్షమాభిక్ష కింద మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ గురువారం సహర్సా జైలు నుంచి విడుదలయ్యాడు. బీహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.