న్యూఢిల్లీ, మార్చి 30: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఒక ఏడాదిలో తమ ఆరు నెలల మూల వేతనానికి మించి స్టాక్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే, ఆ వివరాలు తమకు సమర్పించాలని కేంద్రం కోరింది. వివరాలను నిర్దేశిత నమూనాలోఅందించాలని పేర్కొంది.
మార్చి 20న వెలువరించిన ఆదేశాల ప్రకారం షేర్లు, సెక్యూరిటీలు, డిబెంచర్లను చరాస్తులుగా భావిస్తామని పేర్కొంది. వ్యక్తిగతంగా వీటి లావాదేవీల విలువ రెండు నెలల మూల వేతనాన్ని దాటితే, ఆ సమాచారాన్ని కూడా తమకు తెలుపాలని కోరింది.