న్యూఢిల్లీ : భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మంగళవారం ‘ఎలిఫెంట్ వాక్’ (IAF elephant Walk) కన్నులపండువగా నిర్వహించింది. ఈ వేడుకలు ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా ఎయిర్ఫోర్స్ చేపట్టింది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఎలైట్ ఫైట్ జెట్లతో అద్భుతమైన ‘ఎలిఫెంట్ వాక్’ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారత వైమానిక దళం అమ్ములపొదిలోని అత్యంత ముఖ్యమైన రాఫెల్, జాగ్వార్ వంటి యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. ఈ ఎలిఫెంట్ వాక్లో దాదాపు 75 ఎయిర్క్రాఫ్ట్స్ పాలుపంచుకున్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘స్టే ట్యూన్ ఫర్ మోర్ …’ అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్విట్టర్లో రాసి ఎలిఫెంట్ వాక్ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. స్విఫ్ట్, లెథల్ #75@75 అని ఎయిర్ఫోర్స్ ట్వీట్ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పశ్చిమ విభాగంలో 75 స్కైడైవర్లతో ట్రై-సర్వీసెస్ స్కైడైవింగ్ ప్రదర్శనను నిర్వహించింది. రాఫెల్, జాగ్వార్ విమానాల రాకతో భారత వైమానిక దళం పటిష్ఠంగా తయారైందన్న విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లుగా ఎలిఫెంట్ వాక్ కొనసాగింది.
ఖాదీని ‘జాతీయ వస్త్రాలు’గా పరిగణించి ధరిద్దాం : వెంకయ్యనాయుడు
వ్యక్తిని హెలికాప్టర్కు కట్టి తిప్పారు.. వీడియో వైరల్
ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా.. కారణమేంటంటే..?
భారత్లో పెరిగిన ఆర్-వ్యాల్యూ.. వేగంగా కొవిడ్ వ్యాప్తి
20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘన్ చేరాడు.. ఎవరంటే..?
తాలిబాన్ దేశాన్ని ప్రపంచం గుర్తించాలి.. లేదంటే మరో 9/11 ఘటన తప్పదు: పాక్ ఎన్ఎస్ఏ
పాకిస్తాన్లో శ్రీకృష్ణుడి ఆలయం ధ్వంసం
ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
ఖలిస్తానీ దాడి : సీఎం బియాంత్ సింగ్ దారుణహత్య
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..