న్యూఢిల్లీ : భారతదేశంలో ఆర్-వ్యాల్యూ (R-Value) పెరుగుతుండటం కలవరపరుస్తున్నది. గత 20 రోజుల వ్యవధిలో ఆర్-విలువ 1.17 కు పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. కేరళ, మహారాష్ట్రలో వేగంగా వ్యాప్తి చెందుతుండటం దేశం మొత్తం ఆర్-విలువను పెంచింది. చివరిసారిగా భారతదేశం ఆర్-విలువ 2021 మార్చి 19న 1.19 కి చేరింది. దీని తర్వాత వినాశకరమైన సెకండ్ వేవ్ వచ్చింది. ఒక రోగి నుంచి ఇన్ఫెక్షన్కు గురయ్యే సగటు వ్యక్తుల అంచనాను ఆర్-వ్యాల్యూగా పేర్కొంటారు. ఈ అంటువ్యాధి ముగియాలంటే ఆర్-వ్యాల్యూ 1 కంటే తక్కువగా ఉండాలి.
భారతదేశం మొత్తం మీద పరిస్థితి ఏమాత్రం బాగోలేదని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకుడు సీతాభ్రా సిన్హా తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం ఆర్ విలువ పెరుగుతున్నదని, థర్డ్ వేవ్ భయం గతంసారి కంటే చాలా ఎక్కువగా ఉంటుదని చెప్పారు. ఆగష్టు 2 నాటికి మొత్తం ఆర్-విలువ 1.03 కి పెరిగింది. అయితే, తదుపరి వారం 1 కంటే దిగువకు పడిపోయిందని సీతాభ్రా సిన్హా అన్నారు.
భారతదేశంలోని రాష్ట్రాలవారీగా ఆర్-వ్యాల్యూను చూసినట్లయితే, కేరళ, మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తున్న కొవిడ్ను తెలుపుతుంది. కేరళలో గత వారం ఆర్-వ్యాల్యూ 0.87 గా నమోదవగా.. ఈ వారం 1.33 కి పెరిగింది. అదేవిధంగా, గత వారం 0.87 వద్ద ఉన్న ఆర్ విలువ మహారాష్ట్రలో, 1.06 కి పెరిగింది.
మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో కొవిడ్-19 యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి.
ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలలో మిజోరాంలో ఇప్పుడు అత్యధికంగా ఆర్-వ్యాల్యూ 1.36 గా ఉన్నది. గత వారం ఇక్కడ ఆర్ విలువ 0.67 గా ఉండేది.
అదేవిధంగా, జమ్ముకశ్మీర్లో గత వారం 0.85 నుంచి ఈ వారం 1.25 కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం 0.87 నుంచి ఈ వారం 1.09 కు చేరింది. మిగతా రాష్ట్రాలు 1 కంటే తక్కువగా ఆర్-వ్యాల్యూను కలిగి ఉన్నాయి.
ఇలా ఉండగా, మణిపూర్ రాష్ట్రంలో ఆర్-వ్యాల్యూలో పెరుగుదల కనిపిస్తున్నది. గత వారం ఇక్కడ 0.8 గా ఉండగా, ఈ వారం 0.93 కి పెరిగిది. ఇక హిమాచల్ప్రదేశ్లో గత వారం 0.74 నుంచి ఈ వారం 0.78 కు పెరుగగా.. అసోంలో గత వారం 0.95 నుంచి 0.87 కు తగ్గింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆర్-వ్యాల్యూలో ఎలాంటి మార్పులేదు.
20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘన్ చేరాడు.. ఎవరంటే..?
తాలిబాన్ దేశాన్ని ప్రపంచం గుర్తించాలి.. లేదంటే మరో 9/11 ఘటన తప్పదు: పాక్ ఎన్ఎస్ఏ
పాకిస్తాన్లో శ్రీకృష్ణుడి ఆలయం ధ్వంసం
ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
ఖలిస్తానీ దాడి : సీఎం బియాంత్ సింగ్ దారుణహత్య
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..