న్యూఢిల్లీ: సరిహద్దుల్లో సంసిద్దతను భారత వైమానిక దళం ప్రదర్శించింది. భారతీయ వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్(IAF Chief AP Singh).. ఇవాళ మిగ్-29 యూపీజీ మల్టీరోల్ యుద్ధ విమానాహలో విహరించారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ప్రాంతానికి చెందిన ఓ ఎయిర్బేస్ నుంచి ఆయన ఇవాళ మిగ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. సున్నితమైన సెక్టార్ల వద్ద సెక్యూర్టీ ఆపరేషన్స్ పరీక్షించారు. ఫైటర్ పైలట్ దుస్తుల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ … అప్గ్రేడ్ చెందిన మిగ్-29 విమానంలో ఒంటరిగా సోర్టీ నిర్వహించారు. ఐఏఎఫ్ మిగ్-29 దళంలో అత్యాధునిక వర్షన్కు చెందిన మిగ్-29 యూపీజీ మోడల్ యుద్ధ విమానం జత కూడింది.
#WATCH | Take off visuals of the MiG-29 UPG multi-role aircraft, being flown by Indian Air Force (IAF) Chief Air Chief Marshal AP Singh today on a solo sortie from one of the frontline fighter bases of India. https://t.co/bk4HcpvcQE pic.twitter.com/SsvVcJpTvp
— ANI (@ANI) March 12, 2026