Forest Fire : అరుణాచల్ప్రదేశ్ (Arunachal Pradesh) లోని లోహిత్ వ్యాలీ (Lohit Valley) అడవుల్లో కార్చిచ్చు చెలరేగుతోంది. అడవంతా అగ్నికి ఆహుతైపోతోంది. దాంతో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం ఎంఐ-17V5 హెలికాప్టర్లను మోహరించి నీళ్లు గుమ్మరిస్తోంది.
అయితే, దాదాపు 9,500 అడుగుల ఎత్తు నుంచి ఈ ఆపరేషన్ చేయాల్సిరావడం రెస్క్యూ టీమ్స్కు పెను సవాల్గా మారింది. అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారత వైమానిక దళం, అటవీశాఖ అధికారులు కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. కార్చిచ్చుకిగల కచ్చితమైన కారణాలు ఏవీ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
ఈ మంటలవల్ల ప్రాణనష్టంగానీ, ఆస్తినష్టంగానీ సంభవించినట్లు ఎలాంటి వివరాలు వెల్లడికాలేవని చెప్పారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా కార్చిర్చు సంభవించిన ప్రాంతానికి పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. వారికి అవసరమైన వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Battling forest fires at nearly 9,500 feet in Arunachal Pradesh’s Lohit Valley. #IAF Mi-17V5 helicopters dropped 12,000 litres of water in the rarefied Himalayan air, showcasing exceptional courage, precision and a commitment towards protecting lives and fragile ecosystems.… pic.twitter.com/5SXBm7M5he
— Indian Air Force (@IAF_MCC) January 29, 2026