న్యూఢిల్లీ: అగ్నిప్రమాదంలో (Kuwait Fire) మరణించిన 45 మంది భారతీయుల భౌతికకాయాలతో భారత వైమానిక దళానికి చెందిన విమానం (IAF Aricraft ) కువైట్ నుంచి బయలుదేరింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేరళలోని కొచ్చికి చేరుతుంది. అనంతరం ఢిల్లీకి వెళ్తుంది. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా అదే విమానంలో ఉన్నారు. గురువారం కువైట్కు చేరుకున్న కేంద్ర మంత్రి.. భారతీయుల మృతదేహాలను ముందస్తుగా అప్పగించే అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే 45 మంది మృతదేహాలను ప్రత్యేక విమానం భారత్కు పయణమయింది. కాగా, కొచ్చి విమానాశ్రయం వద్ద అంబులెన్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మృతులకు ఎయిర్పోర్టులో నివాళులు అర్పించనున్నారు. అనంతరం వారి మృతదేహాలను అంబులెన్సుల్లో తరలిస్తారు.
ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల్లో 23 మంది కేరళకు చెందినవారు కాగా, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ముగ్గురు, బీహార్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
కువైట్లోని మంగఫ్ సిటీలో బుధవారం ఉదయం 6 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్బీటీసీకి చెందిన 6 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటల్లో అక్కడికక్కడే 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 45 మంది భారతీయ వలస కార్మికులు ఉన్నారు. వంట గదిలో ప్రమాదం జరిగిందని, అనంతరం మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఇరుక్కుపోయి అక్కడ వెలువడిన పొగ పీల్చడం వల్ల పలువురు కార్మికులు చనిపోయినట్టు తెలుస్తున్నది.
భవనంలో దాదాపు 160 మంది కార్మికులు పని చేస్తున్నారు. చికిత్స పొందుతున్నవారిని కువైట్లోని భారత రాయబారి ఆదర్శ్ పరామర్శించి సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదం జరిగిన భవనంలో కార్మికులు కిక్కిరిసి ఉన్నారని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
A special IAF aircraft carrying mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait has taken off for Kochi.
MoS @KVSinghMPGonda, who coordinated with Kuwaiti authorities ensuring swift repatriation, is onboard the aircraft pic.twitter.com/091hBNWzLL
— India in Kuwait (@indembkwt) June 13, 2024