న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన చెప్పారు. మహమ్మారి సమయంలో కేంద్రం, రాష్ట్రాలు, డాక్టర్లు, నర్సులు, శాస్త్రవేత్తలు, హెల్త్ కేర్ వర్కర్లు ఓ జట్టుగా పనిచేసినట్లు ఆయన తెలిపారు. హెల్త్ కేర్క్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు రాష్ట్రపతి రామ్నాథ్ థ్యాంక్స్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్తో కోవిడ్19ను ఇండియా ధీటుగా ఎదుర్కొందని ఆయన అన్నారు. కేవలం ఏడాది కాలం లోపే రికార్డు స్థాయిలో 150 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఉన్నట్లు రాష్ట్రపతి తెలిపారు. అత్యధిక సంఖ్యలో కోవిడ్ టీకా డోసులు ఇచ్చిన దేశాల్లో ఇండియ అగ్ర స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఆయుస్మాన్ భారత్ కార్డు పేదలకు ఎంతో ఉపయోగపడినట్లు ఆయన చెప్పారు. జన్ ఔషధీ కేంద్రాల వద్ద తక్కువ ధరలకే మందులు లభ్యం కావడం గొప్ప విషయమన్నారు.