సతారా: నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (NCP)ని చీల్చి మహారాష్ట్ర సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా చేరిన తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గురించి శరద్పవార్ ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడారు. ఇవాళ ఉదయం అజిత్ పవార్ ఎన్సీపీని వీడలేదని, ఆయన మా పార్టీ నాయకుడని వ్యాఖ్యానించిన శరద్పవార్.. సాయంత్రానికి లేదులేదు తాను అలా అనలేదని మాట మార్చారు.
అజిత్ పవార్ మా పార్టీ నాయకుడని తాను అన లేదని, ఆ మాట అన్నది సుప్రియా సూలే అని చెప్పారు. అజిత్ పవార్, సుప్రియా సూలే తోబుట్టువుల లాంటి వాళ్లని, కాబట్టి వాళ్లు ఒకరి గురించి ఒకరు చేసుకునే వ్యాఖ్యలకు రాజకీయాలను ఆపాదించడం కరెక్టు కాదని శరద్ పవార్ అన్నారు. అజిత్ పవార్ తమ పార్టీ నాయకుడని తాను అన్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు.
తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని శరద్పవార్ చెప్పారు. ఇటీవల అజిత్ పవార్ తీసుకున్న స్టాండ్ సరైనది కాదని, కాబట్టి ఇప్పుడు ఆయన మా పార్టీ నాయకుడు కాదని ఎన్సీపీ అధినేత వ్యాఖ్యానించారు. కాగా రెండు నెలల క్రితం పార్టీలోని కీలక నేతలతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారులో డిప్యూటీ సీఎంగా చేరారు.