నేను శివసేనలో చేరడం లేదు: ఊర్మిళ

ముంబై: తాను శివసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించింది బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్. మంగళవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సమక్షంలో ఆమె శివసేనలో చేరనున్నట్లు సోమవారం ఉదయం వార్తలు వచ్చాయి. అయితే ఇదే అంశంపై తాము ఊర్మిళను ప్రశ్నించినప్పుడు.. తాను శివసేనలో చేరడం లేదు అని స్పష్టంగా చెప్పినట్లు డీఎన్ఏ పత్రిక వెల్లడించింది. 2019లో కాంగ్రెస్ తరఫున ముంబై నార్త్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయిన ఊర్మిళ.. తర్వాత ఆ పార్టీకి కూడా గుడ్బై చెప్పింది. తాజాగా ఆమె ఉద్ధవ్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన హర్షల్ ప్రధాన్ వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది. అంతేకాదు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఊర్మిళ పేరును కూడా ప్రతిపాదిస్తూ గవర్నర్ బీఎస్ కోషియారీకి ఆమె పేరును పంపినట్లు కూడా అందులో ఉంది. కానీ తాను మాత్రం శివసేనలో చేరబోవడం లేదని ఊర్మిళ చెప్పడం గమనార్హం.
తాజావార్తలు
- ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్ కార్నివాల్ ప్రారంభం..బంపర్ ఆఫర్లు
- మధ్యాహ్న భోజన మహిళా కార్మికులకు సన్మానం
- మమతపై పోటీకి సై.. 12న సువేందు నామినేషన్
- రేపటి నుంచి పూర్తిస్థాయిలో రాజ్యసభ సమావేశాలు
- తిండి పెట్టే వ్యక్తి ఆసుపత్రిపాలు.. ఆకలితో అలమటించిన వీధి కుక్కలు
- నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
- దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- వన్ప్లస్ 9 సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
- వీడియో : కబడ్డీ ఆడిన నగరి ఎమ్మెల్యే రోజా
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి