శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పులో హైబ్రిడ్ టెర్రరిస్టు (Hybrid terrorist) మరణించాడు. గతంలో అరెస్టయిన ఇమ్రాన్ బషీర్ అనే హైబ్రిడ్ టెర్రరిస్టు వెల్లడించిన వివరాల ఆధారంగా షోపియాన్లోని నౌగామ్ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇమ్రాన్ బషీర్ చనిపోయాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఆ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. కశ్మీరీ పండిట్ను చంపిన ప్రాంతానికి సమీపంలోనే ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం.
Based on disclosure of arrested hybrid #terrorist & in continuous raids by Police & security forces, another contact has been established between terrorists & SFs at Nowgam #Shopian, in which hybrid terrorist namely Imran Bashir Ganaie killed by firing of another terrorist. (1/2)
— Kashmir Zone Police (@KashmirPolice) October 18, 2022