రాయ్పూర్: గొడవ వల్ల బావిలోకి దూకిన భార్యను భర్త కాపాడాడు. అనంతరం మరో విషయంపై ఘర్షణ జరుగడంతో ఆమెను హత్య చేశాడు. విస్తూపోయే ఈ సంఘటన ఛత్తీస్గఢ్ (Chhattisgarh Shocker) లోని జష్పూర్ జిల్లాలో జరిగింది. శంకర్ అనే వ్యక్తి తన భార్య ఆశా బాయి, పిల్లలతో కలిసి రౌనిలోని జవఖర్ టౌన్షిప్లో నివసిస్తున్నాడు. ఈ నెల 17న రాత్రి వేళ భార్యాభర్తలు మద్యం సేవించారు. ఈ సందర్భంగా శృంగారంలో పాల్గొవాలని భర్త కోరగా ఆమె నిరాకరించింది. అయితే భర్త శంకర్ బలవంతం చేయగా కలత చెందిన భార్య ఆశా బాయి ఇంటి బయట ఉన్న బావిలోకి దూకింది.
కాగా, శంకర్ వెంటనే స్పందించాడు. అతడు కూడా ఆ బావిలోకి దూకాడు. భార్య ఆశా బాయిని కాపాడి పైకి తీసుకొచ్చాడు. అయితే అనంతరం భార్యాభర్తల మధ్య మరో విషయంపై గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన శంకర్, భార్య ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. ఆ దెబ్బలు తట్టుకోలేని ఆశా బాయి చనిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు భర్త శంకర్ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.