Lawyer | ఉత్తరప్రదేశ్ నోయిడా (Noida)లో దారుణం చోటు చేసుకుంది. 61 ఏళ్ల మహిళా లాయర్ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సుప్రీంకోర్టు న్యాయవాది (Supreme Court lawyer) రేణు సిన్హా (Renu Sinha) తన భర్త నితిన్ నాథ్ సిన్హా ( Nitin Nath Sinha)తో కలిసి నోయిడా సెక్టార్ 30లోని బంగ్లాలో నివాసం ఉంటోంది. అయితే రెండు రోజులుగా ఆమె కనిపించకుండా పోయింది. రేణు సోదరుడు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. దీంతో ఈ విషయంపై లాయర్ సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన సోదరిని ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని ఆరోపించాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు లాయర్ బంగ్లాలో వెతకగా.. బాత్రూమ్లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది.
అయితే ఆమె భర్త నితిన్ మాత్రం కనిపించలేదు. దీంతో అతడి కోసం గాలించగా ఎక్కడా ఆచూకీ లభించలేదు. చివరిక నితిన్ ఫోన్ నంబర్ ట్రాక్ చేయగా.. అది లాయర్ బంగ్లా వద్ద చూపించింది. దీంతో పోలీసులు బంగ్లా మొత్తం వెతకగా.. స్టోర్రూమ్లో కనిపించాడు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, నితిన్ తన భార్యను చంపిన తర్వాత సుమారు 36 గంటల పాటూ స్టోర్రూమ్లోనే దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలను మాత్రం వారు వెల్లడించలేదు.
Also Read..
Rain Alert | దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
Cyber Crime | అసలుకు, నకిలీకి మధ్య తేడాను గుర్తించండి.. 1930పై పోలీసుల వినూత్న ప్రచారం