లక్నో: ఒక వ్యక్తి పెళ్లైన కొత్తలో భార్యకు ఇష్టమైన మోమోలు (Momos) ప్రతి రోజూ తెచ్చేవాడు. కొన్ని నెలల తర్వాత తరచుగా వాటిని తీసుకురావడం మరిచిపోతున్నాడు. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. భర్త ప్రతి రోజూ తన కోసం మోమోలు తీసుకురావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో జరిగింది. మల్పురాకు చెందిన ఒక మహిళకు పినహట్కు చెందిన వ్యక్తితో ఎనిమిది నెలల కిందట పెళ్లి జరిగింది. అయితే ఉత్తరాది చిరు తిండి అయిన మోమోలు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. దీంతో పెళ్లైన కొత్తలో ఆ వ్యక్తి పని తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ప్రతి రోజు భార్య కోసం మోమోలు కొని తెచ్చేవాడు.
కాగా, గత కొన్ని రోజులుగా ఆ వ్యక్తి తన భార్య కోసం మోమోలు తేవడం మరిచిపోతున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నది. దీంతో అలిగిన ఆమె తన పుట్టింటికి వెళ్లింది. అంతేగాక భర్త తన కోసం ప్రతి రోజూ మోమోలు తీసుకురావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. ఆ జంటను ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్కు పిలిపించారు.
మరోవైపు పని ఒత్తిడి వల్ల, ఆలస్యం వల్ల, ఇంటికి త్వరగా చేరుకోవాలని భావించి కొన్నిసార్లు భార్య కోసం మోమోలు తీసుకురావడం మరిచిపోతున్నట్లు కౌన్సెలింగ్ సందర్భంగా ఆ వ్యక్తి చెప్పాడు. అయితే తన కోసం ప్రతి రోజు మోమోలు తీసుకురావాల్సిందేనని ఆ మహిళ పట్టుబట్టింది. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు వారిద్దరి మధ్య ఒక డీల్ కుదిర్చారు. ఆ వ్యక్తి తన భార్య కోసం వారానికి రెండు సార్లు తప్పకుండా మోమోలు తీసుకురావాలని షరతు విధించారు. దీనికి ఒప్పుకున్న ఆ మహిళ భర్త ఇంటికి తిరిగి వెళ్లింది.
आगरा : मोमोज के चक्कर में पति-पत्नी के बीच आई दरार
➡मोमोज न लाने पर पत्नी ने पुलिस से की पति की शिकायत
➡शिकायत के बाद मामला परिवार परामर्श केंद्र हुआ ट्रांसफर
➡काउंसलिंग के बाद पति-पत्नी के बीच हुआ समझौता
➡हफ्ते में दो बार मोमोज खिलाने को लेकर हुआ समझौता
➡मलपुरा की युवती की… pic.twitter.com/39nXczmKZP— भारत समाचार | Bharat Samachar (@bstvlive) February 26, 2024