షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో (Himachal Pradesh) భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రోడ్లు కోతకు గురవడం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. బుధవారం కురిసిన కుంభవృష్టితో (Heavy rainfall) కుల్లు (Kullu) జిల్లాలో కుల్లు-మండి (Kullu-Mandi) మధ్య రోడ్డు కోతకు గురైంది. దీంతో రోడ్డుకు ఇరువైపులా పది కిలోమీటర్ల మేర వేల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి ( vehicles stranded). ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక సతమతమవుతున్నారు. రోడ్డు ఎప్పుడు తెరుస్తారోనని ఎదురుచూస్తున్నారు.
వర్షాలతో రోడ్డు కొట్టుకుపోవడంతో ఐదు నుంచి 10 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయని ఓ వ్యక్తి అన్నారు. కనీసం తాగడానికి నీరు కూడా లేదని చెప్పారు. రోడ్డు వీలైనంత తొందరగా తెరవాలన్నారు. కాగా, వర్షానికి కుల్లు, మండి మధ్య రోడ్డు కనెక్టివిటీ దెబ్బతిన్నదని కుల్లు జిల్లా ఎస్పీ సాక్షీ వర్మ (SP Sakshi Verma) అన్నారు. పండోహ్ (Pandoh) మీదుగా ఉన్న ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం కూడా కొట్టుకుపోయిందని చెప్పారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) రోడ్డును బాగుచేయడానికి ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు. హిమాచల్ప్రదేశ్లో ఈ నెల 26 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.
Kullu, Himachal Pradesh: "There is nothing to eat or drink here. There is a traffic jam of about 5-10 km. The road should be opened soon," say stranded people (23.08) pic.twitter.com/24gX34fUeI
— ANI (@ANI) August 24, 2023
#WATCH | Kullu, Himachal Pradesh: Kullu SP Sakshi Verma says, "Due to the rainfall both the roads connecting Kullu district to Mandi have been damaged. The alternative route via Pandoh is also damaged &. PWD is trying to clear the road…" (23.08) pic.twitter.com/prQ2QlKRG1
— ANI (@ANI) August 24, 2023