Mata Vaishno Devi | ప్రముఖ పుణ్యక్షేత్రం జమ్మూ కశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాది సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. మరో రెండు రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ కొత్త ఏడాది సందర్భంగా వైష్ణో దేవి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికిపైగా గాయపడ్డారు. కాగా, గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Jammu & Kashmir | Huge rush of devotees is being witnessed at Mata Vaishno Devi Shrine in Katra ahead of New Year 2023. pic.twitter.com/W4NipqwFLa
— ANI (@ANI) December 31, 2022