న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని (Uttarakhand) రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న సుమేరు పర్వతాన్ని (Sumeru Mountain) భారీ హిమపాతం (Avalanche) ఢీకొట్టింది. ఆదివారం ఉదయం భారీ మంచుగడ్డ ఒక్కసారిగా సుమేరు పర్వతంపై పడింది. ఈ పర్వతం ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయం (Kedarnath Temple) వెనుకే ఉన్నది. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఎవరూ గాయపడలేదన్నారు. హిమపాతం వల్ల సరస్వతి నదిలో నీటిమట్టం కూడా పెరగలేదని చెప్పారు. కేదార్నాథ్లో ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ (DGP Ashok Kumar) వెల్లడించారు.
ఈ ఏడాది జూన్ 9న కూడా కేదార్నాథ్లో భారీ హిమపాతం సంభవించింది. కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలో ఉన్న సుమేరు పర్వతంపై ఓ భారీ హిమపాతం వచ్చిపడింది. దీంతో పర్వతాలను మంచు కమ్మేసింది.
VIDEO | A massive avalanche hit mountains around Kedarnath Temple earlier today. pic.twitter.com/QqwKxrDsOW
— Press Trust of India (@PTI_News) June 8, 2023