న్యూఢిల్లీ, జూలై 21: నీళ్ల మధ్యలోంచి రైల్లో ప్రయాణిస్తే! ఆహా.. తలుచుకొంటేనే ఓ రకమైన అనుభూతి కలుగుతున్నది కదూ! ఇప్పటికే ఇలాంటివి కొన్ని దేశాల్లో ఉన్నాయి. కానీ, మన దేశంలో తొలిసారి కోల్కతా మెట్రోలో భాగంగా అండర్వాటర్ మెట్రోను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం అవుతున్నది.
సెక్టార్-5 నుంచి హుగ్లీ నది గుండా హౌరా వరకు ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికోసం ప్రత్యేకంగా టన్నెల్ను నిర్మించనున్నారు. 2023 ప్రారంభం నాటికి దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెట్రో మొత్తం ప్రయాణ దూరం 16.6 కిలోమీటర్లు కాగా, అండర్గ్రౌండ్లోనే 10.8 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందులో 520 మీటర్ల మేర నీళ్ల మధ్య నుంచి దూసుకెళ్తుంది.