న్యూఢిల్లీ: కులం తెలియని వ్యక్తి.. కుల గణన కావాలని కోరుతున్నారని .. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. లోక్సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో లోక్సభలో మంగళవారం దుమారం చెలరేగింది. ఆ సమయంలో కలగచేసుకున్న ఎస్పీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. కులం గురించి ఎలా అడుగుతారని ప్రశ్నించారు. మాజీ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నట్లు రాహుల్ ఆరోపించినా.. క్షమాపణ కోరబోనని ప్రకటించారు. అయితే కులం గురించి ప్రస్తావించడం అసంబద్ధం, ఆమోదయోగ్యం కాదు అని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఎవరినైనా కులం గురించి ఎలా అడుగుతారని ప్రశ్నించారు.
जाति कैसे पूछ ली अखिलेश जी ? pic.twitter.com/uaFujlDWrD
— Anurag Thakur (@ianuragthakur) July 31, 2024
అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. గతంలో కొందర్ని మీది ఏమి కులం అని అఖిలేశ్ యాదవ్ వేసిన ప్రశ్నలకు చెందిన కొన్ని క్లిప్లతో ఆ వీడియోను రూపొందించారు. ఓ సందర్భంలో ఓ జర్నలిస్టును మీది ఏం కులం అని అఖిలేశ్ అడిగారు. మరో క్లిప్లో ఓ వ్యక్తితో చర్చిస్తూ పేరు అడిగిన ఆయన.. ఈయన ఏమీ శూద్రుడు కాదు కదా అంటూ అఖిలేశ్ కామెంట్ చేశారు. ఆ వీడియోను పోస్టు చేసిన అనురాగ్.. మీరెలా కులం గురించి ప్రశ్నలు వేశారని క్యాప్షన్లో అఖిలేశ్ను అడిగారు.
బడ్జెట్ ప్రసంగంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ లోక్సభలో ఎంపీ అనురాగ్ మాట్లాడిన వీడియోను ప్రధాని మోదీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. యుంగ్, ఎనర్జిటిక్ నేత ఠాకూర్ చేసిన ప్రసంగాన్ని అందరూ వినాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాస్తవాలను, హాస్యాన్ని జోడించిన అనురాగ్.. ఇండియా కూటమి నీచ రాజకీయాలను ఎక్స్పోజ్ చేసినట్లు మోదీ తన ట్వీట్లో తెలిపారు.
This speech by my young and energetic colleague, Shri @ianuragthakur is a must hear. A perfect mix of facts and humour, exposing the dirty politics of the INDI Alliance. https://t.co/4utsqNeJqp
— Narendra Modi (@narendramodi) July 30, 2024