న్యూఢిల్లీ: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం పూర్తయింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా (పైన ఉన్నవారు ఎవరూ కాదు) మీటను నొక్కి ఓటరు తన అభిప్రాయాన్ని చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్నవారి సంఖ్యను ఎన్నికల కమిషన్ వెల్లడించింది.