అహ్మదాబాద్: కన్నవారిని కోల్పోయిన కొన్ని గంటల్లోనే ఇద్దరు వైద్యులు తమ విధులకు హాజరయ్యారు. బాధను దిగమింగుకుని కరోనా రోగులకు సేవలందించారు. ఈ హృదయవిదారకర ఘటన గుజరాత్లో జరిగింది. వడోదరలోని ఎస్ఎస్జీ ఆసుపత్రిలో డాక్టర్ శిల్పా పటేల్ పని చేస్తున్నారు. గురువారం ఉదయం 3.30 గంటలకు కరోనాతో చికిత్స పొందుతున్న ఆమె 77 ఏండ్ల తల్లి చనిపోయారు. తల్లి మరణాన్ని దిగమింగుకున్న డాక్టర్ శిల్ప, తల్లి అంత్యక్రియల అనంతరం ఆరు గంటల్లో తిరిగి విధుల్లోకి చేరారు. డ్యూటీ కన్నా ఏదీ ముఖ్యం కాదని మరణానికి ముందు తన తల్లి కాంతా అంబలాల్ పటేల్ చెప్పినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.
మరోవైపు డాక్టర్ రాహుల్ పర్మార్, గాంధీనగర్లో కరోనా మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తల్లి కాంత పర్మార్ గురువారం మరణించారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి తల్లి అంత్యక్రియలు నిర్వహించిన డాక్టర్ రాహుల్ శుక్రవారం విధులకు హాజరయ్యారు. తల్లులను కోల్పోయిన ఈ ఇద్దరు డాక్టర్లు ఆ బాధను దిగమింగుకుని కరోనా కష్టకాలంలో రోగుల సేవలకు కొన్ని గంటల్లోనే విధులకు హాజరుకావడం, వ
త్తిపట్ల వారి అంకిత భావాన్ని సహ వైద్యులు, అధికారులు కొనియాడారు.