జైపూర్ : పాకిస్తాన్ మహిళ వలపు వలలో చిక్కిన రాజస్ధాన్ వ్యక్తి సరిహద్దు భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసిన ఉదంతం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి చురు రతన్ఘఢ్కు చెందిన రాం సింగ్ను అధికారులు అరెస్ట్ చేశారు. ఏడాది కిందట పాక్ మహిళా ఏజెంట్ తనను హనీట్రాప్కు గురిచేసిందని కూడా విచారణలో రాం సింగ్ వెల్లడించాడు.
ఈ సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి చేరవేసినందుకు నిందితుడికి పెద్ద మొత్తంలో డబ్బు ముట్టిందని తెలుస్తోంది. చురు జిల్లాలోని రతన్ఘఢ్ గ్రామంలో రాం సింగ్ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రాం సింగ్ ఏడాది నుంచి ఐఎస్ఐతో టచ్లో ఉన్నాడు. బర్మార్ బోర్డర్కు కిలోమీటర్ కన్నా తక్కువ దూరంలో ఉండే ఉమ్మెద్పురా గ్రామంలో రాం సింగ్ నివసిస్తున్నాడు. సింగ్ ఫేస్బుక్ ప్రొఫైల్లో లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా సన్నిహిత సంబంధం పేరుతో ఐఎస్ఐ మహిళా ఏజెంట్ అతడిపై వలపు వల విసిరింది.