న్యూఢిల్లీ: జపనీస్ కంపెనీ హోండా వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న ఎలివేట్, సిటీ, అమేజ్ మోడళ్ల ధరలు పెరగబోతున్నట్లు హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) కుణాల్ బెహ్ల్ ఆదివారం తెలిపారు.
ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి ఇండియా కూడా కార్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచబోతున్నాయి. అదేవిధంగా టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా తమ కార్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచేందుకు యోచిస్తున్నాయి.