చెన్నై : వంట గ్యాస్ ధర తగ్గించాలని తమిళనాడు కాంచీపురం జిల్లాలోని పజయసీవరం గ్రామంలో స్ధానిక మహిళలు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్కు (Nirmala Sitharaman) విజ్ఞప్తి చేశారు. సహయ మంత్రి ఎల్ మురుగన్తో కలిసి గ్రామంలో ప్రచారానికి వచ్చిన సందర్భంగా మహిళలు వంట గ్యాస్ భారాన్ని మోయలేమని ఆర్ధిక మంత్రికి మొరపెట్టుకున్నారు.
తనను కలిసిన మహిళలతో కొద్దిసేపు ముచ్చటించిన నిర్మలా సీతారామన్ ప్రభుత్వ పధకాలతో మీరు లబ్ధి పొందుతున్నారా అని వారిని ప్రశ్నించారు. వంట గ్యాస్ ధర అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా నిర్ణయిస్తారని మంత్రి మహిళలకు వివరించారు.
మన దేశంలో వంట గ్యాస్ లేదని, మనం దాన్ని దిగుమతి చేసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే దేశంలోనూ ధర పెరుగుతుందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వంట గ్యాస్ ధర తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చారు. అయితే గత రెండేండ్లుగా వంట గ్యాస్ ధర తగ్గలేదని అన్నారు.
Read More