న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశంలోని ప్రతి కుటుంబానికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీలు గుప్పించిన బీజేపీ, లక్షల మంది పేదల కొద్దిపాటి నీడను కూడా ధ్వంసం చేస్తున్నది. విద్వేష రాజకీయాలతో బుల్డోజర్ రాజ్ను సృష్టించి మైనారిటీలతోపాటు ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాలను కూడా రోడ్డున పడేస్తున్నది. కరోనా రెండోవేవ్లో దేశమంతా తల్లడిల్లుతున్న సమయంలో కూడా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పేదల ఇండ్లను యథేచ్చగా కూల్చేసినట్టు హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్స్ నెట్వర్క్ (హెచ్ఎల్ఆర్ఎన్) తన నివేదికలో ఆక్షేపించింది. మైనారిటీలనే లక్ష్యంగా చేసుకొన్నట్టు కనిపించినప్పటికీ బుల్డోజర్ ధ్వంస రచనలో ఎస్సీ, ఎస్టీలు కూడా తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నది. నివేదిక పలు సంచలన విషయాలు బయటపెట్టింది.
రోజూ 567 మంది నిరాశ్రయులు
ప్రభుత్వాల చర్యలు నేరపూరితం
సంవత్సర కాలానికిపైగా దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి (ఇండ్ల కూల్చివేతలు) మరింత తీవ్రమవుతున్నదే తప్ప తగ్గటం లేదు. దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ప్రజలను వారి నివాసాల నుంచి గెంటేశారు. 2022 జనవరి-జూలై మధ్య ఈ కూల్చివేతలు మరింత పెరిగాయి. కూల్చివేతల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నాయి. మానవ హక్కులను, చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి.
– ఏనాక్షి గంగూలీ హెచ్ఎల్ఆర్ఎన్