అమరావతి : విజయవాడ నగరంలోని దుర్గ అగ్రహారంలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి పాశవికంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్టీం హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించాయి. మృతుడిని కండ్రిగ ప్రాంతానికి చెందిన రామారావుగా గుర్తించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యకు ఆర్థిక విభేదాలు లేదా వివాహేతర సంబంధం కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.